VKB: పాంబండ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దామని పరిగి MLA రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని ఆయన నివాసంలో బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ప్రాచీన చరిత్ర గల పాంబండ దేవాలయం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాలనర్సయ్య, సర్పంచ్ శ్రీనివాస్, కోట్ల మైపాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, పాండు శర్మ ఉన్నారు.