KMM: చింతకాని మండలం రేపల్లెవాడ పంచాయతీలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. బుధవారం డ్రైన్లలో పేరుకుపోయిన పూడిక (సిల్ట్) తొలగింపు కార్యక్రమాన్ని సర్పంచ్ మడిపల్లి అంబిక ప్రారంభించారు. వర్షాకాలం దృష్ట్యా నీరు నిల్వ ఉండకుండా, దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. గ్రామస్తులందరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.