ఆసిఫాబాద్ జిల్లా కౌటాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలకు మొత్తం 11 మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 147 మందికి గాను 143 మంది హాజరుకాగా, నలుగురు రాలేదు. వొకేషనల్ విభాగంలో 115 మందికి గాను 106 మంది హాజరయ్యారని, 9 మంది పరీక్ష రాయలేదని అధికారులు వెల్లడించారు.