AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో బుధవారం విద్యార్థినిలకు కరాటే, ఆత్మరక్షణ మీద శిక్షణ అందించారు. టౌన్ పోలీసులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీఐ షేక్ గఫూర్ మాట్లాడుతూ.. మహిళా భద్రతపై పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకోవాలని సూచించారు.