అల్లూరి: స్మార్ట్ ఫోన్లు ఉన్నవారు ఆన్లైన్ మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలని కొయ్యూరు మండలం మంప ఎస్సై శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. శుక్రవారం రేవళ్లలో పర్యటించారు. గ్రామస్థులతో సమావేశమయ్యారు. సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు. యూపీఐ, స్కాలర్షిప్ పేరుతో నేరగాళ్లు వల వేస్తున్నారన్నారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే లింకులు, మెసేజ్లపై క్లిక్ చేయవద్దన్నారు.