KNR: మానకొండూరు నుంచి రేకొండకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పట్టుకున్నామని చిగురుమామిడి ఎస్సై పృథ్వీధర్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు ట్రాక్టర్లను సీజ్ చేసి, యజమానులైన చింతకాయల రాజశేఖర్, అనిల్, కనుకట్ల రమేశ్, కీర్తి సంపత్, ముంజ రమేశ్ పై కేసు నమోదు చేశామని చెప్పారు. మండలంలో ఎక్కడైనా అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు.