AP: ఎవరైనా మధ్యవర్తులు ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీలు ఇస్తే నమ్మొద్దని ఆంధ్రప్రదేశ్ వైద్యసేవల నియామక బోర్డు(APMSRB) హెచ్చరించింది. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసపూరిత కాల్స్ పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. బోర్డు నిర్వహించే అన్ని నియామకాలు రిజర్వేషన్ నిబంధనలు, మెరిట్ ఆధారంగా జరుగుతాయని వెల్లడించింది.