BDK: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ఆర్ అండ్ బీ ప్రధాన రహదారి విస్తరణ పనుల దృష్ట్యా మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం అధికారులు తెలిపారు. పైప్లాన్ మళ్లింపు పనుల కారణంగా అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ మండలాల్లో మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 6వ తేదీ ఉదయం 10 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.