NRML: ఖానాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖానాపూర్ మండలంలోని బీర్నంది శివారులో గల వ్యవసాయ బావిలో కారు అదుపుతప్పి బావిలో పడిపోవడంతో కడెం మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన గ్రోమోర్ మేనేజర్ శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.