VZM: బొబ్బిలి రూరల్ CI ఎస్.శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం తెర్లాం మండలం గోపాలవలసలో సైబర్ నేరాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు అకౌంట్, ఆధార్ నంబర్లు, OTPలు గుర్తుతెలియని వారికి చెప్పకూడదన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.