AKP: నర్సీపట్నం సివిల్ జడ్జి కోర్టు భవనానికి రెండో అంతస్తు నిర్మాణానికి ప్రభుత్వం రూ.3.09కోట్ల నిధులు మంజూరు చేసినట్లు స్పీకర్ చింతకాయలు అయ్యన్నపాత్రుడు తెలిపారు. కోర్టు భవన విస్తరణ ద్వారా న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులకు మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. నిధులు మంజూరు చేయించిన స్పీకర్కు న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు.