KMR: భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి వివరాలను పోలీసులు మంగళవారం సేకరించారు. మృతుడు మండల కేంద్రానికి చెందిన గడ్డమీది చంద్రం (42)గా గుర్తించారు. మృతుడి భార్య రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు వెల్లడించారు.