NRML: నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. అటవీ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు సాగిన ఈ ర్యాలీలో సిబ్బంది వన్యప్రాణుల సంరక్షణ,అడవుల పరిరక్షణపై నినాదాలు చేశారు. కార్యక్రమాన్ని అటవీ క్షేత్రాధికారి రామకృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు.