BDK: చుంచుపల్లి ప్రశాంత్ నగర్ పంచాయతీ పరిధిలో భవివాదం చిలికి చిలికి గాలివానలా మారి హత్యాయత్నానికి దారితీసింది. హక్కుపత్రాలున్న యజమానిని బెదిరించడమే కాకుండా, పెట్రోల్ పోసి చంపేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదుతో టూటౌన్ సీఐ డి. ప్రతాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భూ దందాలకు పాల్పడితే సహించేది లేదని వారు అన్నారు.