»58 Toll Plazas On National Highways To Hike Charges By 5 10 From 1 April
Toll Plaza : వాహనదారులకు షాక్… భారీగా పెరగనున్న టోల్ ఛార్జీలు..!
Toll Plaza : వాహనదారులకు ఊహించని షాక్ ఎదురైంది. టోల్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా( ఎన్ హచ్ఏఐ) నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి పెరిగిన టోల్ ఛార్జీలు అమలులోకి రానున్నాయి.
వాహనదారులకు ఊహించని షాక్ ఎదురైంది. టోల్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా( ఎన్ హచ్ఏఐ) నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి పెరిగిన టోల్ ఛార్జీలు అమలులోకి రానున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టోల్ ఛార్జీలను సమీక్షిస్తారు. అందులో భాగంగానే ఈ ఏడాది 5 నుంచి 10 శాతం వరకు ఛార్జీలు పెంచుతున్నట్లు ఎన్ హెచ్ఏఐ అధికారులు తెలిపారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న టోల్ ప్లాజాల్లో ఏప్రిల్ 1 నుంచి పెరిగిన ఛార్జీలు అమలవుతాయి. జాతీయ రహదారులపై తిరిగే అన్ని రకాల వాహనాల (బైక్ మినహా) టారిఫ్ ధరలను 10 రూపాయల నుండి 60 రూపాయల వరకు పెంచారు.
ఇప్పటికే నిత్యావసర వస్తువులు , గ్యాస్ , పెట్రోల్ , కరెంట్ ఇలా ప్రతిదీ భారీగా పెరగడం తో సామాన్యలు బ్రతికే రోజులు లేవు అని మాట్లాడుకుంటున్న సమయంలో ఇప్పుడు టోల్ చార్జీల పెరగడం , ఆ భారం సామాన్య ప్రజానీకం ఫై పడనుంది. మరోపక్క మందులపై కూడా కేంద్రం భారం మోపింది. దాదాపు అన్ని మందులపై 60% వరకు పెంచింది. కరోనా సంక్షోభంలో మందులకు డిమాండ్ పెరిగిందని, ఉచిత వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వ నిధులు ఖర్చయ్యాయన్న సాకు చెప్పి కిందటేడాది మందుల ధరలను 10.76 శాతం పెంచిన కేంద్రం.. ఈసారి ఏకంగా 12.12 శాతం పెంచడం గమనార్హం.