ELR: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ కె.వెట్రిసెల్వి జిల్లా స్థాయీ అధికారులతో నిర్వహించారు. ప్రజలు దగ్గర నుంచి అర్జీలను స్వీకరించి, నిర్ణీత సమయంలోగా సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు. ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.