KMR: బిచ్కుందలో సోమవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 97.91% విద్యార్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. ఇవాళ జరిగిన మ్యాథ్స్, బోటనీ తదితర పరీక్షలకు సంబంధించి సెట్-బీ పరీక్ష పత్రాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. మొత్తం 383 మంది విద్యార్థులకు గాను 375 మంది విద్యార్థులు హాజరు కాగా, 8 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.