KMR: మద్నూర్ మండలంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం తనిఖీ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా నిర్మాణంలో అత్యుత్తమ నాణ్యత పాటించాలని, పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ స్కూల్ మ్యాప్ను పరిశీలించారు.