NTR: (D)లోని రెడ్డిగూడెం(M), కొత్త నాగులూరులో అర్ధరాత్రి ఆస్తి వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. అన్నదమ్ముల మధ్య చెలరేగిన గొడవలో కత్తులు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన మొత్తం ఎనిమిది మందికి గాయాలు కాగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.