BDK: ఇల్లందులోని రద్దీ ప్రాంతమైన జగదంబ సెంటర్లో గల సులభ్ కాంప్లెక్స్ సకాలంలో తెరవకపోవడంపై మున్సిపల్ ఛైర్పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంప్లెక్స్ మూసి ఉండటంతో మహిళలు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆమె తక్షణమే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి నిర్ణీత సమయానికి ప్రారంభించాలని ఆదేశించారు.