MDK: చేగుంట మండలంలో వార్డు సభ్యులకు రెండో విడత శిక్షణ కార్యక్రమం సోమవారం చేపట్టారు. 13 గ్రామపంచాయతీలలోని 114 మంది వార్డు సభ్యులకు రెండో విడతగా శిక్షణ చేపట్టారు. శిక్షణ కార్యక్రమానికి వార్డు సభ్యులు హాజరై పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన పెంచుకోవాలని ఎంపీడీవో చిన్నారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ విజయపాల్ రెడ్డి, ట్రైనర్ సంగమేశ్వర్ పాల్గొన్నారు.