PLD: నరసరావుపేట కలెక్టరేట్లోని PGRS హల్ నందు ప్రజా సమస్యల పరిస్కార వేదిక సోమవారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారులు చెప్పే సమస్యలను వింటూ వారి నుంచి జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అర్జీలను స్వీకరించారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా వింటూ సమస్య పరిష్కారం కోసం సంబంధిత శాఖ అధికారులకు రిఫర్ చేశారు.