KNR: పరస్పర అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకోవడమే శ్రేయస్కరమని కేశవపట్నం ఎస్సై శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 28న నిర్వహించనున్న లోక్ అదాలత్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి, సామరస్య వాతావరణంలో కేసులు పరిష్కరించుకోవడానికి ఇది చక్కని వేదికని తెలిపారు. సత్వర న్యాయం పొందాలనుకునే కక్షీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.