KRNL: కాల్వ గ్రామ సమీపంలోని పుట్టగొడుగుల పరిశ్రమలో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన సుస్మిత (26) కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకుంది. భర్తతో వాగ్వాదం తర్వాత మనస్తాపంతో షెడ్లో ఉరివేసుకుంది. తోటి కార్మికులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత కేసు నమోదు చేస్తామని ఆదివారం పోలీసులు తెలిపారు.