BDK: భద్రాచలంలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో నిర్వహించే శ్రీరామనవమి, రామయ్య పట్టాభిషేకం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు నీరు వసతి వంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.