KKD: కాజులూరు మండలంలో గ్రామీణ రవాణా సౌకర్యాల మెరుగుదలకు రూ.1.43 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నాలుగు సిమెంట్ రోడ్లకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామాలకు మెరుగైన రహదారులు అందించడమే లక్ష్యం అన్నారు.