NLR: నెల్లూరులో MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు బాల వివాహ ముక్త్ ప్రచార రథాన్ని ఆదివారం ప్రారంభించారు. జిల్లాను బాల్య వివాహ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 18 ఏళ్ల లోపు బాలికలకు, 21 ఏళ్ల లోపు బాలురకు వివాహాలు చేయడం నేరమన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే 1098 లేదా 112 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.