పదేళ్ల క్రితం భారత్, వెస్టిండీస్ మధ్య టీ20 ప్రపంచకప్ 2016 సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ పోరులో విండీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం సూపర్-8లో వెస్టిండీస్తో టీమిండియా తలపడుతోంది. ఈ పోరులో ఎవరు గెలిస్తే వారే పోటీలో నిలుస్తారు. ఈ నేపథ్యంలో 2016 ఓటమికి ఇప్పుడు బదులు తీర్చుకోవాలని టీమిండియా ఎదురుచూస్తోంది.