కడప కార్పొరేషన్ కేవలం సంపన్నులకే సేవలు అందిస్తూ, బడుగు బలహీన వర్గాలను విస్మరిస్తోందని చేతివృత్తుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు N.పెంచలయ్య విమర్శించారు. ఆదివారం కడపలో ఆయన మాట్లాడుతూ.. నగరంలోని మురికివాడల్లో కనీసం రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేయర్, కమిషనర్ తక్షణమే స్లమ్ ఏరియాల అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు.