ప్రకాశం: అర్ధవీడు మండలం మొహిద్దిన్ పురం గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. బండారు శివకుమారి అనే మహిళ మొక్కజొన్న తోటలోకి గడ్డి కోసం వెళ్లిన క్రమంలో అడవి పంది దాడి చేసింది. ఈ దాడిలో ఆ మహిళలకు తీవ్ర గాయాలు కాగా 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం గిద్దలూరు ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలించారు.