కోనసీమ: విద్యార్దులు డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మండపేట రూరల్ ఎస్సై కిషోర్ తెలిపారు. తాపేశ్వరం శ్రీ పోలిశెట్టి సత్తిరాజు భూషణం జడ్పీ హైస్కూల్లో పాఠశాల వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పాల్గొని మాట్లాడుతూ.. విద్యార్థులు అందరూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.