EG: ఎన్డీఏ కూటమి బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాజమండ్రిలో పాదయాత్ర గురువారం నిర్వహించారు. మహిళలతో కలిసి ఎంపీ పురందేశ్వరి నల్ల దుస్తులు ధరించుకుని హాజరయ్యారు. పార్లమెంట్లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించిన నేపథ్యంలో ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నారి శక్తిని నిరూపించుకునే సమయమని ఆమె పిలుపునిచ్చారు.