KRNL: ఆలూరు ఆదర్శ పాఠశాల విద్యార్థులు వ్యాసరచన పోటీలో ప్రతిభ కనబర్చారు. గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిన విద్యార్థులను ఇవాళ ప్రిన్సిపల్ వీరేష్ సత్కరించారు. జనాభా సంస్కరణ అంశంపై నిర్వహించిన పోటీలో విజయం సాధించారు. చదువుతో పాటు సమాజ స్పృహ పెంపొందించుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు.