ఖమ్మం నగర శివారు వెలుగుమట్లలోని భూదాన్ భూమిలో ఇల్లు కోల్పోయిన బాధితులకు బీఆర్ఎస్ పార్టీ బాసటగా నిలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు వరసగా 4వ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ భోజనాలను సమకూర్చింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో ఆదివారం వెలుగుమట్ల బాధితులకు అన్నదానం చేశారు.