TG: కోకాపేట్లోని శారదాపీఠాన్ని మంత్రి శ్రీధర్బాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రెండు ఎకరాల భూమి శారదాపీఠానికే ఉంటుంది. భూమిని స్వాధీనం చేసుకుంటామనేది అవాస్తవం. నిర్మాణాలు లేవని అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఆ అధికారులపై చర్యలు తీసుకుంటాం. మధుపార్క్ అపార్ట్మెంట్లను కూలుస్తామనేది అవాస్తవం. ప్రభుత్వం బలవంతపు చర్యలకు దిగదు’ అని తెలిపారు.