MNCL: లక్షెట్టిపేట పట్టణంలోని వ్యాపారులు, ప్రజలు రూ.500 కొత్త నోట్లను చూస్తే హడలిపోతున్నారు. పట్టణంలో ఇటీవల రూ. 500 నకిలీ నోటు చలామణి కావడం సంచలనంగా మారిన విషయం తెలిసింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు నకిలీ నోట్లను చలామణి చేసిన అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. వ్యాపారులలో భయం పోలేదు. తమ దుకాణాలకు వస్తున్న రూ. 500 నోట్లను పరిశీలించి తీసుకుంటున్నారు.