NLG: చిట్యాల మండలం వట్టిమర్తిలో శనివారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రవికుమార్ మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని సూచించారు. విద్యార్థులు అంబేద్కర్ ఆశయాలతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. జీపీవో శాంతి, సర్పంచ్ మేడి శ్రీలత పాల్గొన్నారు.