AP: రాబోయే రోజుల్లో 3.45 లక్షల మంది బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. వ్యాక్సిన్ కోసం కోల్డ్ చైన్ పాయింట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఒక్క డోసు ఇస్తే వీరికి క్యాన్సర్ నుంచి రక్షణ దొరుకుతుందన్నారు. ఆ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని స్పష్టం చేశారు. 14-15 ఏళ్ల వయసున్న బాలికలంతా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.