MHBD: అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం సమాన ప్రాధాన్యతను కల్పిస్తుందని ఎమ్మెల్యే మురళినాయక్ అన్నారు. కేసముద్రం మున్సిపాలిటీ ఉప్పరపల్లి రోడ్లో వీర బ్రహ్మేంద్రస్వామి దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. దేవాలయ నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.