గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేసే వారికి వెన్నునొప్పి, ఊబకాయం, మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ. ప్రతి గంటకు ఒకసారి సీట్లో నుంచి లేచి 5 నిమిషాల పాటు అటుఇటు నడవాలి. స్ట్రెచింగ్ చేయడం వల్ల రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. డెస్క్ జాబ్స్ చేసేవారు ఈ చిన్న చిట్కా పాటిస్తే వెన్నుపూస సమస్యల బారిన పడకుండా ఉండొచ్చు.