TG: బీసీలకు న్యాయం జరగాలంటే దేశవ్యాప్తంగా కులగణన తప్పనిసరని ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు అన్నారు. మోదీ బీసీ అయి ఉండి కూడా ఆ వర్గానికి న్యాయం చేయలేదని ఆరోపించారు. కానీ రాహుల్ గాంధీ తన పాదయాత్రలో బీసీల వెనుకబాటుతనాన్ని గుర్తించి, వారి అసలు సంఖ్య తేల్చేందుకే కులగణనకు పట్టుబట్టారని, సీఎం రేవంత్ రెడ్డి కూడా బీసీల సమస్యలపై సానుకూలంగా ఉన్నారని ప్రశంసించారు.