జగిత్యాల జిల్లా ధరూర్ క్యాంప్ ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ కార్యాలయంలో ఎన్టీపీఏగా బదిలీపై వచ్చిన కొలుగురు వెంకటేశ్వరరావు మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతల్లో విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.