హీరోయిన్ అదా శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాక్సాఫీస్ వసూళ్లే ప్రధాన అంశంగా మారాయని, కానీ తన దృష్టిలో విజయానికి అర్థం వేరే ఉందని తెలిపింది. ‘మీ సినిమా రూ.375కోట్లు వసూలు చేసింది అని చెప్పడానికి బదులుగా.. ఆ మూవీలో మీరు ఏడుస్తున్నప్పుడు నేను కూడా ఏడ్చాను, మిమ్మల్ని ఆ పాత్రలో చూసి నాకు భయం వేసింది’ అని ప్రేక్షకులు చెప్తే కష్టానికి ఫలితం దక్కినట్లే అని చెప్పుకొచ్చింది.