AP: శాసనమండలిలో ప్రతిపక్ష నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో హైదరాబాద్కు బొత్సను తరలించారు. సిటీ న్యూరో సెంటర్లో చికిత్స కొనసాగుతోంది. నిన్న రాత్రే ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు.