E.G: గోపాలపురం నియోజకవర్గంలో 85 మంది లబ్ధిదారులకు రూ. 55 లక్షల ఆర్థిక సహాయం అందజేసినట్లు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. 27వ విడతగా మంజూరైన ఈ చెక్కులు అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సాయం అందేలా కృషి కొనసాగిస్తామని స్పష్టం చేశారు.