రోజురోజుకు రూపాయి విలువ పతనం కావడంపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రూపాయి ఓవర్ వ్యాల్యూగా ఉందని అనలేమని, వాస్తవిక విలువ కంటే తక్కువగా ట్రేడ్ అవుతోందని మాత్రం చెప్పగలమని వెల్లడించారు. అలాగే రూపాయి విలువకు సంబంధించి ఎలాంటి నిర్దిష్ట మారకపు రేటు స్థాయిని RBI లక్ష్యంగా పెట్టుకోదని స్పష్టం చేశారు.