AP: శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సజీవదహనమయ్యాడు. మృతుడు తెలంగాణలోన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కిరణ్(35)గా గుర్తించారు. ప్రమాదంలో లారీ క్లీనర్కు తీవ్ర గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.