NZB: కమ్మర్పల్లి మండలం నాగపూర్ గ్రామ పరిధిలోని వరద కాలువ కింద ఐదు ఎకరాల భూమిలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు సుమారు రూ.50 వేల డ్రిప్ పైపులు, గేట్ వాల్వు, పైపులు ధ్వంసం చేసినట్లు కమ్మర్పల్లికి చెందిన రైతు కోరే రమేశ్ తెలిపారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.