జింబాబ్వేతో మ్యాచ్లో భారత బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన సంజూ(24), అభిషేక్(55) తొలి వికెట్కు 48 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్(33), సూర్య(33), పాండ్యా(50), తిలక్(44) సమష్టిగా రాణించడంతో.. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. బౌలర్లలో నగారవ, ముజారబానీ, మాపోసా, సికందర్ తలో వికెట్ పడగొట్టారు.