ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి ఇవాళ సిట్ అధికారులు ఎదుట లొంగిపోయారు. రాజ్ కేసిరెడ్డికి సమీప బంధువైన అవినాష్, గత కొంతకాలంగా పరారీలో ఉండగా.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ అధికారుల ఎదుట లొంగిపోయారు.